సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని అవకాశంగా మార్చుకుని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలు(Bus Charges) పెంచితే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ఏపీకి వచ్చే ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
Read Also: Sankranti traffic jam : సంక్రాంతి ప్రయాణం కష్టమా? విజయవాడ హైవేపై ట్రాఫిక్ షాక్!

RTC నిర్ణయించిన ఛార్జీలకు గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని ఆదేశించింది. ఈ పరిమితిని మించి ఛార్జీలు(Bus Charges) వసూలు చేసినట్లు గుర్తిస్తే, సంబంధిత బస్సులను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు.
ఈ నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ప్రయాణికులు అధిక ఛార్జీలపై ఫిర్యాదులు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: