ఏపీ రాజధాని అమరావతిలోని (Amaravathi) ఎన్టీఆర్ భవన్లో టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం ప్రెస్మీట్ నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్టుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో ఎయిర్పోర్టు అవసరం లేదని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంటే రాజకీయంగా ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Read also: Srikakulam: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Appalanaidu criticizes the Bhogapuram airport project
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన దిశానిర్దేశంతో భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయని అప్పలనాయుడు తెలిపారు. ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని అన్నారు. ప్రజల ప్రయోజనాలకే ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: