हिन्दी | Epaper

Riots Case: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ

Pooja
Riots Case: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ

2020 సంవత్సరంలో ఢిల్లీలో(Riots Case) జరిగిన ఆర్లర్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. పౌరసత్వం చట్టం సవరణ కోరుతూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అయితే ఈ అల్లర్ల కేసులో 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఫిబ్రవరి 2020 అల్లర్ల కేసులో బెయిల్ నిరాకరిస్తూ సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారించిన సుప్రీం ధర్మాసనం కూడా నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ లకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Read also: Siddipet crime: సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

Riots Case

అసలు గొడవ ఏమిటి?

2020లో పౌరసత్వం (సవరణ) చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో(Riots Case) పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. రోజుల తరబడి ఉద్రిక్తలు నడిచాయి. ఈ కేసులో ఉమర్ ఖలీద్ ను అదుపులోకి తీసుకుని సెప్టెంబర్ 13, 2020 నుంచి కస్టడీలో ఉంచారు. ఇక ఇమామ్ జనవరి 28,2020 నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ అల్లర్లు చెలరేగడానికి కొన్ని వారాల ముందు నుంచే జైల్లో ఉన్నాడు.

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు

ఫిబ్రవరి 2020లో ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆల్లర్లు జరిగాయి. చాలారోజులు కొనసాగిన ఈ హింసకు అనేకమంది మరణాలకు దారితీసింది. ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అయితే పరిపాలనను అస్థిరపరిచేందుకు నిందితులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. పాలన మార్పుతో పాటు దేశమంతటా కుట్రకు పాల్పడినట్లుగా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న గుల్పిషా ఫాలిమా, మీరాన్ హైదర్, ఫిసా ఉర్ ఎమమాన్, మహ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ అనే మరో ఐదుగురికి మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అయితే ఖలీద్, ఇమామ్ లకు మాత్రం బెయిల్ నిరాకరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

📢 For Advertisement Booking: 98481 12870