శ్రీకాళహస్తి : దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో(Srikalahasteeswara Temple) ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కుటుంబసభ్యులతో (Srikalahasti) కలసి రాహుకేతుదోష నివారణ పూజలు జరిపించుకున్నారు. కేంద్ర మంత్రి రాక సందర్భంగా దక్షిణ గోపురం వద్ద ఆలయ ప్రోటోకాల్ మేరకు ఇఓ డి. బాపిరెడ్డి వేద పండితులతో ఆలయ మర్యాదలతో మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.
Read also: Sakey Sailajanath PressMeet: రాయలసీమ పథకాలపై విమర్శలు

మంత్రి ఆలయంలో నిర్వహించే రాహుకేతుదోష నివారణ పూజలు జరిపించు కోవాలని కోరగా ఇఓ బాపిరెడ్డి వెంటనే వారికి ప్రత్యేక రాహుకేతు దోష నివారణ టిక్కెట్టు రూ.5 వేల కొనుగోలు చేసి సహస్రలింగేశ్వరుని ఆలయం వద్ద ఏర్పాటు చేసారు. (Srikalahasti) వేదపండితులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. వారికి స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసారు. మృత్యుంజయస్వామి ఆలయం వద్ద వారికి వేదపండితులతో ప్రత్యేకాశీర్వచనాలు అందించారు. ఎఇఓలు మోహన్, విద్యాసాగర్ రెడ్డిలు వారికి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను తీర్థ ప్రసాదాలను అందించారు. ఏర్పాట్లును ఆలయ ఎపిఆర్లు రవి, శ్రీనివాసులు, టెంపుల్ ఇన్సెపెక్టర్లు వెంకటస్వామి, హరికృష్ణ, సుదర్శనం నాయుడు పర్యవేక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: