हिन्दी | Epaper

Rammohan Naidu: మత్తు రహిత రాష్ట్రం లక్ష్యం

Saritha
Rammohan Naidu: మత్తు రహిత రాష్ట్రం లక్ష్యం

ఇచ్ఛాపురంలో విజయవంతంగా అభ్యుదయం సైకిల్ యాత్ర

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ (AP) ను మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢసంకల్పంతో ఉన్నారని గత ప్రభత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంగా మారి యవత భవిష్యత్తు చిన్నా భిన్నమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. విశాఖ రేంజి పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో” జంటూ 25 మంది పోలీసులు నాలుగు జిల్లాలు, 75 మండలాలు, 508 గ్రామాల్లో 51 రోజులపాటు 1,300 కి.మీ దూరం సాగిన ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పూర్త య్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను హోంమంత్రి వంగల పూడి అనితతో కలిసి ఆయన ఆవిష్కరిం వారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడతూ కూటమి ప్రభత్వం కలిగిన శక్తిగా మార్చేందకు కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం యువత కేవలం శ్రమశక్తిపైనే కాకుండా ఆధునిక సాంకేతికత, నైపుణ్యాల కలయికతో ప్రపంచస్థాయిలో వాణించాలని ఆకాంక్షించారు.

Read also: Andhra Pradesh: నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Rammohan Naidu: మత్తు రహిత రాష్ట్రం లక్ష్యం

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక విభాగం

ఇచ్ఛాపురం ఆడబిడ్డగా ఇక్కడ ముగింపు వేడకలు జరగడం సంతోషంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంత్రి లోకేష్ తన పాదయాత్రలో గంజాయి బాధితల కష్టాలు చూసి ఆనాడే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఐజీ గోపినాధ్ జెట్టి మానసపుత్రికగా వచ్చిన ఈ యాత్ర ద్వారా గంజాయిని రాష్ట్రంలో జీరో స్థాయికి తీసుకు వచ్చాం. (Rammohan Naidu) కేవలం శిక్షల ద్వారానే అవగాహన ఆమె కాకండా, ద్వారా యువతలో మార్పు తెస్తున్నామని వివరించారు. ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ మాట్లాడుతూ. ప్రభుత్వ అరాచక పాలనలో యువత మత్తులో మునిగిపోయిందని, నేడు ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలు భయం వీడి 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిరోధం ఒక్క పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని ప్రజలందరూ భాగస్వామలు కావాలన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన డీజీపీ, ఎస్పీలకు కృతజ్ఞతలు తెలిపార, ఈగల్ ఐజి ఎ. రవికృష్ణ మాట్లాడుతూ స్వయంగా తల్లిదండ్రులే తమ పిల్లలపై ఫిర్యాదు చేస్తున్నారని, దీని బట్టి మత్తు పదార్ధాలు ఎంతగా వారిని బానిస చేస్తన్నాయో అర్ధమవుతుందని తెలిపారు.

మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ మాట్లాడుతూ స్కూళ్లు, కాలేజీలో విద్యార్థలు తమ సహచరుల ప్రవర్తనలో తీవ్ర మార్పు వస్తే మత్తు పదార్థాలకు బానిసయ్యారని అనుమానం ఉంటే ఈగల్కు తెలపాలని, టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించాలని, మీక పోలీసుల నుంచి ఎటువంటి సమస్యలు రావని హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చేపట్టి ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్, విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వుండ్కర్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, వేల మంది విద్యార్థులు, పోలీసులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అని నినదించారు. మొదట ఇచ్ఛాపురంలో పోలీస్ స్టేషన్ వద్ద కేంద్ర, రాష్ట్ర మంత్రులు ‘డ్రగ్స్ వద్దు బ్రో పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి సాంస్కృతిక ప్రదర్శనలతో రాజావారి మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రితో పాటు ప్రముఖులు సైకిల్ తొక్కగా, హోంమంత్రి ద్విచక్ర వాహనం నడుపుతూ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు ఎన్. ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870