Bangladesh T20 World Cup 2026 : కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఐసీసీ టీ20 వరల్డ్కప్ సందర్భంగా భారతదేశానికి తమ జాతీయ జట్టును పంపించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భద్రతా కారణాలను చూపుతూ, తమ జట్టు ఆడాల్సిన అన్ని మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని International Cricket Council (ICC) ను అధికారికంగా కోరింది.
ఈ పరిణామాలు, ఐపీఎల్ 2026 కోసం కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ Mustafizur Rahman ను విడుదల చేయాలని Board of Control for Cricket in India (BCCI) ఆదేశించడంతో మొదలయ్యాయి. భారత్–బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం (Bangladesh T20 World Cup 2026) BCB అత్యవసర సమావేశం నిర్వహించింది. అంతకుముందు శనివారం సాయంత్రం జూమ్ ద్వారా కూడా కీలక చర్చ జరిగింది. ఈ సమావేశంలో, భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 వరల్డ్కప్లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడం పట్ల ఏర్పడిన పరిస్థితులను సమీక్షించారు.
Read also: Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్
BCB విడుదల చేసిన ప్రకటనలో, “గత 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలో బంగ్లాదేశ్ జట్టు భద్రతపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు ప్రయాణించకూడదని నిర్ణయించాం” అని తెలిపింది.
అందువల్ల, బంగ్లాదేశ్ జట్టు ఆడాల్సిన అన్ని మ్యాచ్లను భారత్ వెలుపల వేదికలకు మార్చాలని ఐసీసీని అధికారికంగా కోరినట్లు BCB స్పష్టం చేసింది. ఆటగాళ్లు, జట్టు సిబ్బంది, బోర్డు అధికారులు సహా అందరి భద్రత, సంక్షేమమే తమకు ప్రధానమని పేర్కొంది.
బంగ్లాదేశ్ మ్యాచ్లు ఎక్కడ ఉండేవి?
షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్తో, ఫిబ్రవరి 17న నేపాల్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇవన్నీ కోల్కతాలోని Eden Gardens మరియు ముంబైలోని Wankhede Stadium లో జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ల వేదికలపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: