మహేష్బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్ను జనవరి 5న పారిస్లోని యూరప్లోనే అతిపెద్దదైన ‘లే గ్రాండ్ రెక్స్’ థియేటర్లో విడుదల చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలుస్తుంది. టీజర్ విడుదల రాత్రి 9 గంటలకు జరగనుంది. భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్న ఫిల్మ్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ చిత్రాన్ని మార్చి 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read also: Jana Nayagan Trailer: ‘జన నాయగన్’ ట్రైలర్ విడుదల

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: