పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్నేళ్లుగా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సినిమా షూటింగులు చేసుకుంటూ వచ్చారు. తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో, దీని తర్వాత పవన్ సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో పవన్ ప్రయాణంపై అందరికీ క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాలిటిక్స్ లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే న్యూ ఇయర్ కానుకగా ఆయన కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో(Surender Reddy) పవన్ హీరోగా ఓ మూవీ చేయనున్నారు. సమాజంలో ప్రజలు, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉంటే సమాజం బాగుంటుంది అనే అంశంపై ఈ పొలిటికల్ డ్రామా తెరకెక్కనుంది.
Read also: MTV: మూతపడిన ‘ఎంటీవీ’ మ్యూజిక్ ఛానెల్స్?

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: