కుటుంబ అనుబంధాలు ఎంతో అమూల్యమైనవి. మనకంటూ ఓ తోడు ఉంటుంది అనే భరోసా ఎంతో ఊరటనిస్తుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఇక ప్రపంచమే తమకు అవసరం లేదనుకుంటారు. నిజమే పగలంతా కష్టపడి రాత్రి అయ్యేసరికి ఇంటికొస్తే మనల్ని ఆప్యాయంగా పలకరించే తోడుకోసం పరితపిస్తాం. ఆ పలకరింపే దూరమైతే ఆ బాధను భరించడం ఎవరికైనా కష్టమే. ఓ వివాహితకు ఇదే వేదన ఎదురైంది. ప్రేమగా చూసుకునే భర్త మరణంతో ఆమెకు జీవితమే అంధకారంగా మారిపోయింది. దీంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

wife committed suicide along with her children.
పిల్లలకు విషమిచ్చి, ఆపై తల్లి ఆత్మహత్య
కల్వకుర్తిలోని తిలక్ నగర్ లో నివసిస్తున్న ప్రసన్న(40) భర్త భీమ్ శెట్టి ప్రకాశ్ 40 రోజుల కిందట మరణించారు. వీరికి కుమారుడు ఆశ్రిత్, కుమార్తె మేఘన (13) ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త అకాల మృతితో ప్రసన్న ఇద్దరు పిల్లలతో ఉంది. అయితే భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ప్రసన్న కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాత్రి కుమారుడు, కుమార్తెతో కలిసి ప్రసన్న కేక్ కట్ చేసి, నూతన సంవత్సరం ఆనందంగా చేసుకున్నారు. అనంతరం పిల్లలకు విషం కలిపిన అన్నం తినిపించింది. ప్రసన్న కూడా దాని తినింది. దీంతో తల్లి ప్రసన్న, కుమార్తె మేఘన మరణించారు. కుమారుడు ఆశ్రిత్ మాత్రం కొన పాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: