హైదరాబాద్ : ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్న మోడీ, అమిత్ షా వ్యాఖ్యల్లో నూటికి నూరుశాతం జరుగుతుందని మెదక్ ఎంపి రఘునందర్రావు (MP Raghunandan) అన్నారు. గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఊరందరికి శకునం చెప్పే బల్లి పోయి కుడితిలో పడ్డట్టు కెసిఆర్ ప్రస్తుత పరిస్థితి ఉందని ఎంపి ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు ఊరందరి పంచాయితీలు తెంపిన కెసిఆర్ ఇప్పుడు కుటుంబంలో కొడుకు కూతురు, అల్లుడు బిడ్డ మధ్య పంచాయతీ తెంవలేకపోతున్నాడని విమర్శించారు.
Read also: KCR : కేసీఆర్ పై టీడీపీ నేతల ఫైర్
తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘునందన్ రావు.. త్వరలో బిఆర్ఎస్ ఫేడ్ అవుట్ కావడం ఖాయం అన్నారు. కవిత త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడం భయం అన్నారు. అసెంబ్లీలో కెసిఆర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వచ్చినప్పుడు కెటిఆర్, కౌశిక్ రెడ్డి లేచి నిలబడకపోవడం వారి విజతకే వదిలేయాలన్నారు. ముఖ్యమంత్రి కావాలని కెటిఆర్ ఆకపడుతున్నా మేరకు బిఆర్ఎస్ పార్టీ, ఆయన క్యాడర్, కుటుంబసభ్యులు సహకరించడం లేదని అభిప్రాయపడ్డారు. హరీశ్ రావు(Harish Rao) ప్రస్తుతం మౌనంగా ఉండి జరుగుతున్న సంఘటనలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతోందని ఈ విషయంలో బాండ్ రాసి ఇవ్వగలనని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ బిజెపి లో నేతల మధ్య వర్గపోరు పార్టీని ద్యామేజ్ చేస్తోందన్న అభిప్రాయంపై స్పందించిన రఘునందన్ రావు.. నాలుగు గోడల మధ్య నేతలు తమ తమ అభిప్రాయాలు చెబుతాదని అయితే అంతిమంగా అధ్యక్షుడితే తుది నిర్ణయం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు అయ్యాక ఎవరూ విభేదించలేదన్నారు. ప్రజాస్వామ్యంలో కూర్చొని మాట్లాడుకునే అవకాశం కూడా లేదన్నట్లు మా పార్టీల విభేదాలు ఉన్నాయని మీడియా ప్రచారం చేస్తోందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బండి సంజయ్ వర్సెస్ ఈటు రాజేందర్ అంశంపై స్పందించారు. పార్టీ గుర్తుల లేకుండా జరిగిన ఎన్నికలను బట్టుకుని ఆయు క్యాండిడేట్ ఈయన క్యాండిడేట్ అని మాట్లాడటు ఏమిటన్నారు. ఒక ఎన్నికకు మరో ఎన్నికకు పాత్ర సొంతన పెట్టకూడదన్నారు. ఇప్పటి వరకు ఉనా తెలంగాణ వేరు ఇప్పుడున్న తెలంగాణ వేరు అని పడే బిఆర్ఎస్. రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూశాక ప్రజం బిజెపి వైపు ఆసక్తి చూపుతున్నారని ధీమా వ్యక్త చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: