हिन्दी | Epaper

TTD: మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

Radha
TTD: మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి(TTD) ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. తొలి మూడు రోజుల్లోనే లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని పులకించిపోయారు.

Read Also: TTD: గత దశాబ్దంలో ఎన్నడూ లేని లడ్డూ విక్రయాలు

TTD
TTD

జనవరి 8 వరకు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు జరిగిన తొలి మూడు రోజుల్లో మొత్తం 1,77,337 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ దర్శనాల్లో మొదటి మూడు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకే అవకాశం కల్పించారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ ప్రవేశ మార్గాల వద్ద టోకెన్లను స్కాన్ చేసి భక్తులను క్యూలైన్లలోకి అనుమతించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి ఒక్క రోజులోనే 40,008 మంది భక్తులు స్వామివారి దర్శనం పూర్తిచేశారు.

ఈ-డిప్ టోకెన్లు కలిగిన భక్తుల దర్శనాలు ముగిసిన అనంతరం, టోకెన్లు లేని సాధారణ భక్తులకు (సర్వదర్శనం) కూడా వైకుంఠ ద్వార దర్శనానికి(TTD) అవకాశం కల్పించనున్నారు. అక్టోపస్ భవనం నుంచి సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులను పంపించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. చేపట్టిన సమర్థవంతమైన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870