
ఏలూరు జిల్లా(Eluru crime) ముసునూరు మండలం రమణక్కపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. రమణక్కపేట ఉప తపాలా కార్యాలయంలో పోస్టు ఉమెన్గా విధులు నిర్వహిస్తున్న సాయి దుర్గ, ఆమె భర్త పల్లం సాయిచంద్ తమకు ప్రాణహాని ఉందంటూ ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు.
Read Also: NewYear Accident: అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
పోస్టాఫీస్ ఎదుట యువకుడిని కట్టేసి కొట్టిన బంధువులు..
బుధవారం(Eluru crime) రమణక్కపేట పోస్టాఫీస్ సమీపంలో ఈ జంట ఉన్న సమయంలో యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం యువకుడిని బలవంతంగా స్తంభానికి కట్టేసి, కర్రలు మరియు రాళ్లతో తీవ్రంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సాయిచంద్కు గాయాలు అయ్యాయి.
అదే సమయంలో యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితులకు రక్షణ కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: