हिन्दी | Epaper
సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Tejaswini Y
Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Husband Kills Wife: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు(Palnadu crime) జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో కుటుంబ కలహం ప్రాణాంతకంగా మారింది. భార్యపై అనవసర అనుమానాలు పెంచుకున్న భర్త ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతురాలు పుష్ప కాగా, నిందితుడు ఆమె భర్త సాల్మన్ రాజుగా పోలీసులు గుర్తించారు.

Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

AP Crime News
Palnadu crime: Cruelty.. Husband beats wife to death with a green stone

దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు

వివాహమైనప్పటి నుంచే పుష్పపై సాల్మన్ రాజు అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ గొడవలకు దిగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే కారణంగా దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్ర ఆగ్రహానికి లోనైన సాల్మన్ రాజు ఇంట్లో ఉన్న పచ్చడి బండతో పుష్పపై దాడి చేశాడు.

తీవ్ర గాయాల పాలైన పుష్ప అక్కడికక్కడే రక్తస్రావంతో మృతి(Died) చెందింది. ఘటనను గమనించిన పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం(Postmortem) కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటనతో గ్రామంలో భయభ్రాంతులు నెలకొన్నాయి. అనుమానం పేరుతో జరుగుతున్న కుటుంబ హింస సంఘటనలు పెరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870