జర్మనీలో హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా జరిగిన ఓ భారీ బ్యాంకు దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వరుస సెలవులతో మూసి ఉన్న బ్యాంకును లక్ష్యంగా చేసుకున్న దొంగలు… సొరంగం తవ్వి లోపలికి ప్రవేశించి సుమారు రూ.300 కోట్ల విలువైన నగలు, నగదు, విలువైన వస్తువులను చోరీ చేశారు.
Read also: America: మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

Massive bank robbery in Germany
ఈ ఘటన జర్మనీ నార్త్ రైన్–వెస్ట్ఫాలియా రాష్ట్రంలోని గెల్సెన్కిర్చెన్ నగరంలో చోటుచేసుకుంది. బ్యాంకు పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజ్ నుంచి లోపలికి సొరంగం తవ్విన దొంగలు… లాకర్ రూంలోకి చేరుకుని 3,250 లాకర్లలో 3,000కు పైగా లాకర్లను తెరిచి ఖాతాదారుల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
క్రిస్మస్ సెలవులే దొంగలకు అవకాశంగా…
క్రిస్మస్ సందర్భంగా గురువారం, శుక్రవారాలు బ్యాంకుకు సెలవులు కాగా… శని, ఆదివారాలు సాధారణ వీకెండ్ సెలవులు. దీంతో బ్యాంకు మొత్తం నాలుగు రోజుల పాటు మూసి ఉండటం దొంగలకు అనుకూలంగా మారింది. ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న దొంగలు… భారీ పరికరాలతో పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడ్డారు.
‘ఓషన్స్ ఎలెవన్’ స్టైల్ ప్లాన్
ఈ దొంగతనం తీరు హాలీవుడ్ చిత్రం **‘ఓషన్స్ ఎలెవన్’**ను గుర్తు చేస్తోందని పోలీసులు తెలిపారు. ముందుగానే ఒక కారును దొంగిలించిన నిందితులు… ఆ కారును ఉపయోగించి బ్యాంకు పరిసరాల్లో తిరిగినట్లు సీసీటీవీ ఆధారాలు సూచిస్తున్నాయి.
సోమవారం ఉదయం వెలుగులోకి
సోమవారం ఉదయం బ్యాంకులో ఫైర్ అలారం మోగడంతో ఈ భారీ చోరీ విషయం బయటపడింది. విషయం తెలిసిన వెంటనే వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున బ్యాంకును తాత్కాలికంగా మూసివేశారు.
ఇన్సూరెన్స్ ఆధారంగానే అంచనా
జర్మన్ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం లాకర్లకు ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఆ ఇన్సూరెన్స్ వివరాల ఆధారంగా దాదాపు రూ.300 కోట్ల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: