రాష్ట్రన సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
విజయవాడ : స్థానిక సంస్థలకు (AP) 15వ ఆర్థిక సంఘం నిధులు ఆంక్షలు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేసారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ల సమస్యలను శశి భూషణ్ కుమార్ కు తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు ప్రధానంగా ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ 15 వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పైన తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కరెంటు బకాయిలు గ్రీన్ అంబాసిడర్ జీతాలు చెత్త సేకరణ వాటికి ఖర్చు పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఆందోళనలో ఉన్న విషయాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు.

Read also: AyodhyaVisit: అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం
ఆదేశాలను సడలించాలని గతంలో (AP) మాదిరిగానే చేసిన పనులకు అంగన్వాడి భవనాలకు సీసీ రోడ్లకు, సైడ్ డ్రయిన్స్ కు విద్యుత్ పరికరాల కొనుగోలు రిపేర్లు, మోటార్ రిపేర్లకు వాడుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు వినతిపత్రాన్ని ఇచ్చారు. గత 25 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో(Grama Panchayat) సాధారణ నిధులు కూడా బిల్లులు పాస్ కాకుండా ఉన్న విషయాన్ని కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో చర్చించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లా డుతూ సాధారణ నిధులు బిల్లులు పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు వినతి పత్రాన్ని పరి శీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: