కిలో రూ.80 నుండి 100కు చేరిన రేటు
చలి తీవ్రతతో 70 శాతం తగ్గిన దిగుబడి
Hyderabad : ప్రస్తుత వాతావరణం కూరగాయల తోటలకు ప్రతికూలంగా మారింది. ఈసారి ఉత్తరాది ప్రాంతాలను తలిపించే విధంగా చలి పంజా విసురుతోంది. ఈ చలి తీవ్రతతో దిగుబడి తగ్గడంతో డిమాండ్కు సరిపడా లేక రాష్ట్రంలో కూరగాయల ధరలు(Vegetable Prices) భారీగా పెరిగాయి. సాధారణంగా కూరగాయలు అధికంగా పండే ఈ సీజన్లో రూ.50 నుంచి రూ.60కు కిలో దొరికేవి. దిగుబడి తగ్గిపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయలైనా కిలో రూ.80 పైబడి సెంచరీ ధర పలుకుతున్నాయి. ఆకు కూరలకు కూడా రూ.60 నుంచి రూ.80 వెచ్చించాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.
Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్

మార్కెట్లో వినియోగదారులకు ఒక్కో రోజుకు కనీసం రూ.200 వెచ్చిస్తే తప్ప కూరగాయల(Vegetable Prices) అవసరాలు తీరడం లేదు. సాధారణంగా ఈ సీజన్లో అన్ని కూరల్లో వాడే టమాట కిలో రూ.20 నుంచి రూ.30 మించేది కాదు. బీర, బెండ, కాకర, చిక్కుడు కూరగాయలు అన్నీ ఇప్పుడు రూ.80 నుండి రూ.100కు పైగా అమ్మతున్నారు. ఒక్కో సోరకాయ ధర రూ.40, పచ్చిమిర్చి రూ.100 కు కిలో అమ్ముతున్నారు. దిగుబడి కాగా చలి కారణంగా పిందె దశలోనే రాలి పోవడం, ఆకులు నల్లబడి పోవడం, పూత రాలిపోవడంతో కూరగాయల తగ్గుతున్నది. మొక్కల ఆకులు పెలుసుబారి నల్లబడి దిగుబడి తగ్గిపోతున్నది. ప్రతీ సీజన్లో ఎకరానికి 15 టన్నుల కూరగాయల దిగుబడి వస్తుంటాయి. అయితే ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఎకరాకు మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది.
చలి అధికంగా ఉండడంతో 70 శాతం దిగుబడి తగ్గింది. ఎకరం పొలంలో బీర పంట సాగు చేస్తే రోజు తప్పించి రోజు క్వింటాల్ కన్నా ఎక్కువే కోతకు వచ్చేవని రైతులు అంటున్నారు. ఇప్పుడు 50 కిలోలు మాత్రమే వస్తున్నాయని, 200 వరకూ వచ్చే సోరకాయలు చలి తీవ్రతతో ఇప్పుడు 80 వస్తున్నాయని చెబుతున్నారు. అలాగే టమాట వారానికి 50 బాక్సులు వస్తుండగా, ప్రస్తుతం 20 బాక్సులు రావడం కష్టంగానే ఉందని వాపోతున్నారు. చలికి పొగమంచు(Winter Effect) మిర్చి, బెండ, కాకర, బీర, కీరదోస ఆకుల మీద పడడంతో మొక్కలకు భూమినుంచి పోషకాలు తగిన మోతాదులో అందడంలేదు. దీంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయిందని రైతులు ఆందోళన చెందు తున్నారు. ఇలా దిగుబడి తగ్గడంతో కొన్నిచోట్ల కూరగాయల పంటను పూర్తిగా తీసివేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: