హైదరాబాద్ (Hyderabad) లో, న్యూ ఇయర్ వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, కీలక రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.
Read Also: Telangana: యూరియాకు ప్రత్యేక అధికారులు
ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చే ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్ పరిసర ప్రాంతాలను ‘నో ఎంట్రీ’ జోన్లుగా ప్రకటించారు. ప్రత్యేకంగా, ఫ్లైట్ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే పీవీ ఎక్స్ప్రెస్ రోడ్ ద్వారా అనుమతి ఇవ్వబడింది. అలాగే రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సిటీలోకి ప్రవేశించరాదని అధికారులు వెల్లడించారు. మెట్రో రైళ్లు కూడా నూతన సంవత్సర వేడుకలకు అనుగుణంగా ప్రత్యేక షెడ్యూల్లో నడపబడతాయి.

మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు
సాధారణంగా రాత్రి 11 గంటలకు చివరి సర్వీస్ ప్రారంభమవుతుంది, కానీ డిసెంబర్ 31న స్టార్టింగ్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరతాయి. అలాగే, సికింద్రాబాద్, నాంపల్లి, ఫలక్నుమా, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణికుల డిమాండ్, రద్దీ ప్రకారం ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యంగా నడిపేలా ఏర్పాట్లు చేశారు.సీపీ సజ్జనార్ నగర పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు.
తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపించడం, రోడ్లపై హడావుడి చేయడం, బాణాసంచాలు, కేక్ల ద్వారా శబ్ధ కలిగించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు పూర్తిగా నిషేధమని తెలిపారు. యువత రైడ్లలో ప్రమాదకర విన్యాసాలు, సైలెన్సర్లు తీసివేసి శబ్ధ కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రశాంత వాతావరణంలో, తమ ఇళ్ల వద్ద జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: