భారతదేశంలోని పౌరులు ఉన్నతమైన చదువుల కోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఇటీవల ఈ సంఖ్య అధికంగా పెరిగింది. ప్రత్యేకించి చదువుకునేందుకు ఇక్కడి విద్యార్థులు ప్రపంచంలోని అనేకదేశాలకు వెళ్తున్నారు. ఆశించిన చదువును ముగించుకుని, అక్కడే ఉద్యోగాన్ని పొంది, ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. అయితే ఇటీవలకాలంలో ఆయాప్రమాదాలు, ఇతర కారణాలతో పలువురు మృత్యువాత పడుతున్నారు.
Read Also: Bangladesh politics : తారిక్ రెహ్మాన్ స్పీచ్లో మార్టిన్ లూథర్ కింగ్ ఛాయలు?

ఈ ఏడాది ఒక్క టొరంటోలోనే 41 మంది హత్యకు గురికావడం తీవ్ర అలజడిని కలిగిస్తున్నది. వారంరోజుల క్రితమే టొరంటోలో 30 వేళ్ల భారతీయ మహిళ హిమాన్షి ఖురానా హత్య ఘటన మరువకముందే మరో భారతీయ విద్యార్థి శివంక్ అవస్థి(20), హత్యకు గురయ్యాడు. దీంతో భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు
టొరంటో విశ్వవిద్యాలయంలోని స్కార్ బరో క్యాంపస్ సమీపంలో మంగళవారం 20ఏళ్ల భారతీయ విద్యార్థి శివంక్ అవస్థిపై దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో ఉండగా పోలీసులు గమనించారు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు(Canada) కోల్పోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.34 గంటలకు హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో గుర్తుతెలియని కాల్ పై పోలీసులు స్పందించారు. తీవ్రగాయాలతో ఉన్న వ్యక్తి గురించి సమాచారం తెలియగానే అధికారులు స్పందించారు తుపాకీ గాయంలో ఉన్న బాధితుడిని అధికారులు గుర్తించారు.
బాధితుడు అక్కడిక్కడే మరణించాడు’ అని పోలీసులు బుధవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. పోలీసులు వచ్చేలోపు నిందితుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడని ప్రకటనలో పేర్కొంది. శివంక్ అవస్థ హత్యపై భారత కాన్సులేట్(Canada) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన విషాదకరమైన ఘటనగా పేర్కొంది. శివంక్ అవస్థి కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. తమ బిడ్డ గొప్పగా చదువుకుని, తమను ఆదుకుంటాడనే ఆశతో నిరీక్షిస్తున్న తల్లిదండ్రులకు తమ కుమారుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎదిగిన కుమారుడు విగతజీవిగా మారడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: