हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Chandrababu Naidu: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టండి

Rajitha
Chandrababu Naidu: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టండి

సిఎం చంద్రబాబును కలిసిన విజయవాడ ఎంపి చిన్ని, ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్

విజయవాడ : గ్రేటర్ విజయవాడ మున్సి పల్ కార్పొరేషన్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (Chandrababu Naidu) విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కోరారు. ఈ మేరకు ఆయన, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. సుస్థిర ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని కోరుతూ అందుకు సంబంధించిన ప్రతిపాదన లను కూడా అందజేశారు. దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read also: AP: రాజంపేటలో గంజాయి ముఠా అరెస్ట్

Chandrababu Naidu

Chandrababu Naidu

ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని

నగర పరిసరాల్లోని 74 గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటైతే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, సమగ్ర నీటి సరఫరా, వరద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా మధ్య ఉన్న పరిపాలనా విభజన వల్ల పోలీస్, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ పరిపాలన వంటి అంశాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులకు ఒక పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తాము చేసిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని పేర్కొన్నారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్పై త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేశినేని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ గత ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని మంత్రి సత్యకుమార్ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870