జంట హత్యల కేసులో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి(Pinnelli) రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి(Pinnelli Venkatarami Reddy)ల రిమాండ్ను మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి సోదరులను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్ విచారణ ద్వారా హాజరుపరచారు. ఈ సందర్భంగా వారి రిమాండ్ను జనవరి 7వ తేదీ వరకు కొనసాగించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Breaking News: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ

ఈ కేసు నేపథ్యం ఇలా ఉంది. ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులను దారుణంగా హత్య చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని కారు ఢీకొట్టి, అనంతరం బండరాళ్లతో కొట్టి ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని ఏ7గా కేసులో చేర్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరు స్వయంగా లొంగిపోగా, అప్పటి నుంచి జైలు రిమాండ్లో కొనసాగుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: