క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ(YCP) అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,(YS Jagan) తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. గురువారం ఉదయం, స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. పులివెందులలో జరిగిన ఈ పర్యటనలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి రెడ్డి కూడా ఆయనతో పాటు చర్చి సందర్శించారు.
Read Also: AP CID: అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ

ప్రార్థన అనంతరం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రార్థనలు ముగిసిన తర్వాత, జగన్ చర్చి వెలుపల ఉన్న అభిమానులు, స్థానికులకు అభివాదం చేస్తూ, క్రిస్మస్ శుభాకాంక్షలు (YS Jagan) తెలిపారు. ఈ సందర్భంగా, ఆయన రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పర్యటన సమయంలో పులివెందులలో వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చర్చి పరిసరాల్లో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: