మతం ముసుగులో ఉగ్రవాదులుగా మారుతున్నారు. మతం మంచి చేయమని, మానవత్వాన్ని చాటించమని, తోటి మానవుడికి సాయం చేయమని చెబుతుంది. కానీ మతం పేరుతో మనుషుల్ని హతమారుస్తూ, అదే తమ మతం గొప్పతనమని విర్రవీగుతున్న ఉగ్రవాదులు ప్రపంచానికి ఒక సవాలుగా మారారు. ఆస్ట్రేలియాలోని(Australia) ప్రసిద్ధ బాండీ బీచ్ ను రక్తసిక్తం చేసిన ఉగ్రదాడి వెనుక ఉన్న భీకర కుట్రను పోలీసులు ఛేదించారు.
Read Also: Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో దైవిక సహాయం: మునీర్
ఈ ఘోరానికి ఒడిగట్టిన తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) పక్కా ప్యూహంతోనే ఈ మారణహోమానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో సమర్పించిన కీలక పత్రాల్లో నిందితులు పొందిన యుద్ధ శిక్షణ, విదేశీ పర్యటనల గురించిన విస్తుపోయే విషయాలు వెల్లడి అయ్యాయి. ముఖ్యంగా నిందితులు కాల్పులకు ముందు భారీ కసరత్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
టాక్టికల్ ట్రైనింగ్
న్యూ సౌత్ వేల్స్ లోని మారుమూల గ్రామీణ(Australia) ప్రాంతాల్లో వీరు తుపాకులు పట్టుకుని పైరింగ్ ప్రాక్టిస్ చేస్తున్న వీడియోలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబరులో రికార్డైన ఈ వీడియోల్లో శత్రువుల కంట పడకుండా ఎలా దాక్కోవాలి, కాల్పులు జరిపి ఎలా పారిపోవాలి అనే అంశాలపై వీరు ‘టాక్టికల్ ట్రైనింగ్’ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
నిందితులపర్యటనలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నాయి. ముఖ్యంగా నవంబరులో తండ్రీకొడుకులు ఇద్దరూ ఫిలిప్పీన్స్ లోని దవావో నగరానికి వెళ్లి అక్కడ ఒక హోటల్ లో నెలరోజుల బస చేశారు. దవావో నగరం ఇస్లామిక్ స్టేట్కా ర్యకలాపాలకు కేంద్రంగా ఉన్న నేపథ్యంలో.. వీరు అక్కడే ఉగ్రదాడికి అవసరమైన తుదిశిక్షణ పొంది ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: