సినిమా టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా టికెట్ రేట్ల అంశంపై త్వరలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఏపీలో షూటింగ్ జరిగే సినిమాలు, అలాగే భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచే అంశాన్ని ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించనుంది.
Read Also: Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యునరేషన్

హోం శాఖ ఆధ్వర్యంలో
ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా హోం శాఖ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సినిమాటోగ్రఫీ శాఖ(Department of Cinematography)తో కలిసి విధానపరమైన చర్చలు జరిపి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఈ దశ పూర్తైన తర్వాత సినీ పరిశ్రమ ప్రముఖులతో కీలక భేటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాల అనంతరం టికెట్ ధరలపై ఒక స్పష్టమైన విధానం ప్రకటించే అవకాశం ఉంది.
ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేశ్(Kandula Durgesh) స్పందిస్తూ, సినిమా టికెట్ రేట్ల పెంపుపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హై బడ్జెట్ సినిమాలు, ఏపీలో చిత్రీకరణ చేసే సినిమాలకు ప్రత్యేకంగా టికెట్ ధరల ప్రతిపాదనలు రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. సినీ ప్రముఖులతో సమావేశానికి సంబంధించి తేదీలు త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: