ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) ప్రజా సమస్యల పరిష్కారం కోసం పురమిత్ర యాప్ను తీసుకొచ్చి సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పురమిత్ర’ యాప్ (‘Puramitra’ APP) కు ఒక కొత్త ఫీచర్ జోడించబడింది. ప్రజలకు వేగంగా మరిన్ని సేవలు అందించేలా కీలక మార్పులు చేస్తోంది. ప్రజల సమస్యలపై మున్సిపల్ కమిషనర్లు స్పందించి పరిష్కారం చూపేలా ప్లాన్ చేశారు. ఈ పుర యాప్లో ఒకే అంశంపై ఐదుకుపైగా సమస్యలు వస్తే.. అవి కమిషనర్ల లాగిన్లో ఆరెంజ్ కలర్ హాట్స్పాట్లుగా కనిపిస్తాయి.
Read Also: AP Deputy CM: పవన్ కు న్యాయ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు
సమస్యలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం
ఈ సమస్యలకు క్షేత్ర పర్యటనల్లో కమిషనర్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ.. అసలు కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్తున్నారో లేదో తెలుసుకునే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. (AP) రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రజలు తమ సమస్యలను ఫోటోలతో సహా పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేశారు.

ప్రజల నుంచి వస్తున్న సమస్యల్ని వీలైనంత త్వరగా పరిస్కరిస్తున్నారు. తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ఒకే ప్రాంతంలో ఒకే రకమైన సమస్యలు ఎక్కువగా ఉంటే, అవి వెంటనే కమిషనర్ల దృష్టికి వెళతాయి. అప్పుడు ఆ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న ఈ మార్పులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదపడతాయని ఆశిస్తున్నారు. ఈ విధానాన్ని పంచాయతీల్లోనూ అమలు చేయాలని ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ను కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: