శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి(Srikalahasti) పుణ్యక్షేత్రంలో మాజీ ముఖ్య మంత్రి వైకాపా పార్టీ అధినేత వైయస్ జగ న్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి.(YS Jagan) ఆదివారం జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదనరెడ్డి పర్యవేక్షణలో శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ శ్రీనివా సులు, మైనారిటి నాయకుడు పఠాన్ ఫరీద్ ఖాన్ సారధ్యంలో ఘనంగా నిర్వహించారు. మైనారిటీ నాయకుడు పఠాన్ ఫరీద్ ఖాన్ సుమారు 300 మంది మహిళలతో పట్టణంలో ఊరేగింపు జరిపారు.
Read Also: AP: ప్రజల సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు

జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేలాది మందికి అన్నదానం
జగన్ చారిటబుల్ ట్రస్టు సారధ్యంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా వేలాది మందికి అన్నదానం చేసారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని యువతకు మార్గదర్శకంగా వారికి రక్షణ కల్పించుటకు బైక్ నడిపే ప్రతి యువకుడు తన కుటుంబాన్ని గుర్తుపెట్టుకోవాలని మాజీ శాసనసభ్యుడు మధుసూధన రెడ్డి సూచించారు. (YS Jagan) ఇందుకు తమ వంతు కర్తవ్యంగా వాహనం నడిపే ప్రతి ఒక యువకుడు తలకు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ 600 మంది యువతకు ఉచితంగా హెల్మెట్స్ ను అందిం చారు. అలాగే డప్పు కళాకారులు 400 మందికి డప్పులను అందించారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ నివాదాలు చేసారు. ఈ కార్యక్రమాల్లో మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నియోజకవర్గ పరిశీలకులు ఓడూరు గిరిధర్రెడ్డి, వయ్యాల కృష్ణాంరెడ్డి, ఉన్నం వాసుదేవనాయుడు, సుధాకర్ రెడ్డి, జడ్పిటిసి సంధ్యారాణి, పగడాల రాజు, బర్రె సుదర్శనం రెడ్డి, చెవిరెడ్డి మధుసూదనం రెడ్డి, గంగారి రమేష్, ఎంపిపి హరిప్రసాదొడ్డి, మున్నారాయల్, బుల్లెట్ జయశ్యామ్ రాయల్ తదితరులు హాజరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: