AP Police: విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘అపోలిస్’ (ఆటోమేటెడ్ పోలీస్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) అనే నూతన విధానాన్ని డిజిపి హరీశ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కొత్త విధానం ద్వారా గతంలో మూడు నెలల సమయం పట్టే సంక్షేమ రుణ మంజూరు ప్రక్రియ ఇప్పుడు కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. ఈ సందర్భంగా డిజిపి హరీశ్ కుమార్ గుప్తా ఒక పోలీస్ ఉద్యోగికి తన కుమార్తె వివాహం కోసం రూ.3 లక్షల సంక్షేమ రుణాన్ని కొత్త వ్యవస్థ ద్వారా తక్షణమే మంజూరు చేసి విడుదల చేశారు. అవసరమైన పత్రాలను పరిశీలించిన తర్వాత, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే రుణం అందించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
Read also: Breaking News: Tirumala: టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?

AP Police
పోలీసు శాఖలో పరిపాలనా విధులను సులభతరం చేసేందుకు, కాగిత రహిత పాలనను ప్రోత్సహించేందుకు ‘అపోలిస్’ ఇఆర్పి ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు. డిజిపి కార్యాలయం నుంచి బెటాలియన్లు, యూనిట్ కార్యాలయాల వరకు అన్ని విభాగాలను ఈ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకువస్తారు. భవిష్యత్తులో మెరుగైన నిర్ణయాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను కూడా దీనికి అనుసంధానం చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘అపోలిస్’ మొబైల్ యాప్ను కూడా డిజిపి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా సిబ్బంది సులభంగా సంక్షేమ రుణాలు, సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పేస్లిప్స్, మెడికల్ రిపోర్టులు, పోలీస్ శాలరీ ప్యాకేజీ వివరాలను కూడా చూసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అదనపు డిజిపి ఎన్. మధుసూదన్ రెడ్డి, ఐజిపి సిహెచ్. శ్రీకాంత్, డీఐజీ అన్బు రాజన్తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: