Parthiban cancels Dubai trip : జాతీయ అవార్డు గ్రహీత తమిళ దర్శకుడు పార్థిబన్ మరోసారి తన మానవీయతతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ప్రముఖ మలయాళ దర్శకుడు, నటుడు శ్రీనివాసన్ మరణ వార్త విన్న వెంటనే, దుబాయ్ వెళ్లాల్సిన ప్రయాణాన్ని రద్దు చేసుకుని కొచ్చికి చేరి ప్రత్యక్షంగా నివాళులు అర్పించారు.
శనివారం వయోభారిత అనారోగ్యంతో త్రిప్పుణితుర తాలూకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసన్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69 ఏళ్లు. ఈ వార్త పార్థిబన్ను తీవ్రంగా కలచివేసిందని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో భావోద్వేగంగా వెల్లడించారు.
చెన్నై నుంచి కొచ్చికి విమానాలు లభించకపోవడంతో, సాయంత్రం 7:55కి తానే కారును డ్రైవ్ చేస్తూ విమానాశ్రయానికి చేరుకున్నానని పార్థిబన్ చెప్పారు. మార్గమధ్యలో నాలుగు సార్లు ప్రమాదాలకు అతి దగ్గరగా తప్పించుకున్నానని తెలిపారు. 8:50కి ఉన్న ఫ్లైట్లో సీట్లు లభించకపోయినా, “పైలట్ సీటైనా సరే” అంటూ (Parthiban cancels Dubai trip ) ఇండిగో సీనియర్ మేనేజర్ను సరదాగా కోరానని చెప్పారు. చివరకు ఒక సిబ్బంది దిగిపోవడంతో ఆ సీటు తనకు దక్కిందని, ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read also: Home Programme: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం
రాత్రి 11 గంటలకు కొచ్చి చేరిన తాను, అక్కడ ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితిలో, శ్రీనివాసన్ ఇంటికి సమీపంలోని ఒక సాధారణ హోటల్లో బస చేశానని తెలిపారు. “ఎక్కడ నుంచైనా సానుభూతి తెలియజేయవచ్చు. అయినా, నన్ను ఇక్కడికి ఏదో శక్తి లాగింది,” అని పార్థిబన్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
నివాళుల సమయంలో మోహన్లాల్, మమ్ముట్టి, దిలీప్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, తనకు కనిపించింది సంపద కాదు.. ఒక పవిత్ర ఆత్మ, గొప్ప సృజనాత్మకుడు మాత్రమేనని చెప్పారు. తాను మౌనంగా పూలు అర్పించి వెళ్లానని, గుర్తింపు కోసం కాకుండా నిజమైన స్నేహం, గౌరవం కోసం వచ్చానని స్పష్టం చేశారు.
అయితే దర్శకుడు రాజేష్ తనను గుర్తించి పంపిన సందేశం తన హృదయాన్ని తాకిందని పార్థిబన్ తెలిపారు. “నీలా చెన్నై నుంచి మౌనంగా వచ్చి నివాళులు అర్పించడం నిజమైన స్నేహానికి నిదర్శనం,” అని రాజేష్ పంపిన మాటలను ఆయన పంచుకున్నారు. ఈ సంఘటన తనకు ఒక జీవన తత్వాన్ని నేర్పిందని, తాను చూసిన వారందరిలో నిజమైన హీరో శ్రీనివాసన్ అని పార్థిబన్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: