AI tools ban India : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాట్జీపీటీ, జెమినై వంటి ఏఐ టూల్స్ను ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ టూల్స్ వాడటం వల్ల దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు అన్ని రంగాల్లో జెమినై, చాట్జీపీటీ వంటి టూల్స్ విస్తృతంగా వాడుతున్నారు. అయితే కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా ఈ ఏఐ టూల్స్ ద్వారా షేర్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం.
Read Also: Bigg Boss 9: గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు, (AI tools ban India) ఇతర కీలక సమాచారం ఏఐ టూల్స్ ద్వారా విదేశాలకు చేరే అవకాశం ఉందని కేంద్రమంత్రి జితిన్ ప్రసాద రాజ్యసభలో వెల్లడించారు. ఈ పరిస్థితి దేశ భద్రతకు ముప్పుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఏఐ టూల్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాట్జీపీటీతో పాటు ఇతర ఏఐ టూల్స్ను వాడకూడదంటూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: