Indian Gov: కేంద్ర బడ్జెట్ 2026 రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశాభివృద్ధికి దోహదపడే విధానాలు, కొత్త నియమాలు, సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు MyGovIndia తన అధికారిక X (ట్విట్టర్(Twitter) ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. ప్రజల అవసరాలు, ఆశయాలను ప్రతిబింబించేలా బడ్జెట్ రూపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.
Read also: IND Vs SA: భారత్-సౌతాఫ్రికా మ్యాచ్లో సౌతాఫ్రికా ఆగ్రహకర బేటింగ్

MyGov వేదికగా మీ ఐడియాలకు అవకాశం
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన MyGov డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను నేరుగా పంపే అవకాశం ఉంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, స్టార్టప్స్, పన్ను విధానం, డిజిటల్ ఇండియా, పర్యావరణం వంటి విభాగాల్లో ప్రజలు తమ ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రతి పౌరుడి సూచన దేశ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించగలదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరికీ ఉపయోగపడే, సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న బడ్జెట్ రూపొందించేందుకు ఈ సూచనలు దోహదం చేస్తాయని తెలిపింది.
పాలసీల రూపకల్పనలో మీ పాత్ర
Indian Gov: మీరు ఇచ్చే ఒక్క సలహా కూడా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే విధానంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా MyGov ద్వారా వచ్చిన ప్రజాభిప్రాయాలను కేంద్రం పలు పాలసీల్లో పరిగణనలోకి తీసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేశ ఆర్థికాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి తోడ్పడే ఆలోచనలను పంచుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రజలతో కలిసి పాలన సాగించాలనే ఆలోచనకు ఇది ప్రతీకగా భావిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ 2026 కోసం ప్రభుత్వం ఎందుకు సూచనలు కోరుతోంది?
ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించేందుకు.
ఎక్కడ సూచనలు పంపవచ్చు?
MyGov వెబ్సైట్ ద్వారా.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
read also: