हिन्दी | Epaper

Banana: గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?

Pooja
Banana: గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?

అరటిపండ్లు(Banana) సంవత్సరమంతా సులభంగా లభించే పోషకాహారం. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఈ పండును చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తితో పాటు గుండె, మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్ల వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఇవీ..

తక్షణ శక్తి అందిస్తుంది
అరటిపండ్లలో(Banana) సహజ చక్కెరలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయి. వ్యాయామం చేసే ముందు లేదా పని మధ్యలో అరటిపండు తినడం ఉత్తమం.

Banana
Banana

మనసుకు ప్రశాంతత
అరటిపండ్లలో ఉన్న ట్రిప్టోఫాన్ అనే పదార్థం ‘హ్యాపీ హార్మోన్’గా పిలిచే సెరోటోనిన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

రక్తహీనతకు మేలు
ఇనుము ఎక్కువగా ఉండటంతో అరటిపండ్లు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇవి మంచి ఆహారం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
విటమిన్ B6, విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

చర్మం, జుట్టుకు మేలు
అరటిపండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి కూడా తోడ్పడతాయి.

గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరం
ప్రతిరోజూ అరటిపండ్లు తినడం వల్ల గర్భిణీ మహిళలకు శక్తి పెరుగుతుంది. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870