దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Pollution) రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air quality index) ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం ప్రభావంతో పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల తరగతి గదుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

38 వేల తరగతి గదుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు
ఈ విషయాన్ని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్(Ashish Sood) శుక్రవారం మీడియాకు వివరించారు. వాయు కాలుష్య సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని చెప్పారు. అలాగే పర్యావరణ సెస్ నిధులతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మెకానికల్ రోడ్ స్వీపర్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
మొత్తంగా ఢిల్లీలోని సుమారు 38 వేల తరగతి గదుల్లో దశలవారీగా ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో భాగంగా 10 వేల తరగతి గదుల్లో ఈ పరికరాల ఏర్పాటుకు టెండర్లు ఇప్పటికే పిలిచామని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: