తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ బ్యాంక్ ముందడుగు వేసింది. ఈ క్రమంలో టీటీడీ(TTD)కి రూ.37,97,508 విరాళంగా అందించింది. ఈ నిధులతో అలిపిరి చెక్పోస్ట్ వద్ద భక్తుల లగేజీ పరిశీలన కోసం అత్యాధునిక భద్రతా స్కానర్ను ఏర్పాటు చేయనున్నారు.
Read also: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ను తిరుమలలోని టీటీడీ(Tirumala Tirupati Devasthanams) అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ ప్రణేశ్ కుమార్, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం. సెల్వరాజ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఇందిరా, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్రతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: