రాజమండ్రిలో(Rajahmundry) జరిగిన పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో(Nara Lokesh) మూడు నూతన భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన రూ.34 కోట్లు ఖర్చు చేసిన మూడు భవనాలను ప్రారంభించారు. వాటిలో మంజీరా బ్లాక్ పేరుతో పరీక్షల భవనం, గౌతమి బ్లాక్ పేరుతో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనం, ఇంద్రావతి బ్లాక్ పేరుతో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్న శ్రీ మరియు ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు.
Read also: CM Chandrababu: ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపిన సీఎం

ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అభివృద్ధి పనులు
నన్నయ్య యూనివర్సిటీలో(Nara Lokesh) జరిగిన కార్యక్రమానికి ముందు, మంత్రి లోకేశ్ రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను సందర్శించి, అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద నూతన లోగో ఆవిష్కరించారు. అలాగే, పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ను ప్రారంభించారు. హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ అనే సైన్స్ ప్రాజెక్టును పరిశీలించి, విద్యార్థులతో చర్చించారు.
కళాశాల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మంత్రి లోకేశ్ అభినందించారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) నిధులతో కళాశాల ప్రధాన ద్వారం నిర్మించారు. పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు ఈ అభివృద్ధిలో సహకరించాయి. హన్స సొల్యూషన్స్ సంస్థ CSR నిధులతో ఇన్నోవేషన్ హబ్ నిర్మించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో డిజిటల్ క్లాస్రూమ్లు ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో క్రీడల్లో రాణించిన విద్యార్థులను కూడా మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: