ఆంధ్రప్రదేశ్లోని(AP) అరకు లోయలో(CM Chandrababu) ఉత్పత్తి అయ్యే అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘నానోలాట్ సిరీస్’ కాఫీ కొన్ని గంటల్లోనే అమ్ముడైన ఘనతపై ఆయన స్పందించారు. ఈ కాఫీ ద్వారా అరకు రైతులకు సుస్థిర ఆదాయం, నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తున్నందుకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read also: TTD: తిరుమల పరకామణిపై హైకోర్టు కీలక ఆదేశాలు..

నానోలాట్ సిరీస్ ప్రత్యేకత
‘నానోలాట్ సిరీస్’(CM Chandrababu) కాఫీ ధర కిలో రూ. 10,000గా ఉండినా, ఆన్లైన్లో రెండో విడత కేవలం రెండు గంటల్లోనే అమ్ముడవ్వడం విశేషం. ప్రతి రైతు చిన్న ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో కాఫీ గింజలను పండిస్తారు. మైక్రో-బ్యాచ్లలో వేయించి, సహజ రుచి, సువాసనల నష్టంలేకుండా ప్యాక్ చేస్తారు. దీనిద్వారా అంతర్జాతీయ మార్కెట్లో అరకు కాఫీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ విజయం వెనుక నాంది ఫౌండేషన్ 25 ఏళ్ల కృషి ఉంది. ఈ సంస్థ గిరిజన రైతుల జీవనోన్నతికి అనేక పద్ధతులు ప్రవేశపెట్టింది. టెర్రొయిర్ పద్ధతిని కాఫీ సాగులో ఉపయోగించి, స్థానిక నేల మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చడం ద్వారా అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కించబడింది. నాంది ఫౌండేషన్ అధిపతి మనోజ్ కుమార్ బృందానికి అనేక ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు, అరకు కాఫీని ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్గా తీర్చిదిద్దిన నాంది ఫౌండేషన్ను ప్రత్యేకంగా అభినందించారు. అరకు రైతులకు నిరంతర మద్దతు అందిస్తున్న ఆనంద్ మహీంద్రా సేవలను ఆయన ప్రశంసించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: