HIV Infection: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో తీవ్రంగా కలచివేసే ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యం వెలుగుచూసింది. సత్నా ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియా బాధితులైన ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకునేందుకు తరచూ రక్త మార్పిడిపై ఆధారపడే ఈ చిన్నారులు, గత కొన్నేళ్లుగా వివిధ బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం పొందుతున్నారు.
Read also: Crime: తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు
అధికారిక వివరాల ప్రకారం, ముగ్గురు వేర్వేరు బ్లడ్ బ్యాంకుల(Blood banks) నుంచి మొత్తం 189 యూనిట్ల రక్తాన్ని ఈ పిల్లలకు ఎక్కించారు. ఈ ప్రక్రియలో 150 మందికి పైగా దాతల రక్తం వారికి చేరింది. అయితే దాతల రక్తాన్ని అవసరమైన వైద్య ప్రమాణాల ప్రకారం సరిగా పరీక్షించకపోవడమే ఈ ఘోరానికి కారణమని జిల్లా స్థాయి విచారణలో తేలింది.

పిల్లల జీవితాలతో చెలగాటం
ఈ ఘటనపై స్పందించిన ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సంబంధిత బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్తో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను సస్పెండ్ చేసింది. అలాగే సత్నా జిల్లా ఆసుపత్రి మాజీ సివిల్ సర్జన్ డాక్టర్ మనోజ్ శుక్లా(Manoj Shukla)కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, ఈ ఏడాది మార్చిలోనే తొలి హెచ్ఐవీ పాజిటివ్ కేసు నమోదు కాగా, ఏప్రిల్ నాటికి మరికొందరు చిన్నారులు వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ దాదాపు తొమ్మిది నెలలపాటు ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం, జిల్లా అధికారులు బయటకు తెలియనివ్వకుండా దాచిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల్లో ఒక చిన్నారి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, “మాకు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియడం లేదు” అంటూ తన వేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే వ్యాధి… ఇప్పుడు హెచ్ఐవీ: సత్నా పిల్లల దుస్థితి
ఈ వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, రక్త పరీక్షల వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. సుమారు 250 మంది దాతల్లో కేవలం 125 మందినే గుర్తించగలిగారని కాంగ్రెస్ నేత డాక్టర్ విక్రాంత్ భూరియా విమర్శించారు. ఇప్పటికే తలసేమియాతో బాధపడుతున్న పేద కుటుంబాల పిల్లలు, ఇప్పుడు జీవితాంతం హెచ్ఐవీ(human immunodeficiency viruses) చికిత్సపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం దేశాన్ని కలచివేసే విషయమని అన్నారు.
ప్రభుత్వం విచారణ కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ, బాధిత కుటుంబాలకు నిజమైన న్యాయం ఎప్పుడు జరుగుతుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: