బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood) తన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ (‘Sood Charity Foundation’) ద్వారా దేశవ్యాప్తంగా 500 మంది పేద మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేయించారు. కేవలం చికిత్స అందించడమే కాకుండా, క్యాన్సర్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహిళలకు పునర్జన్మను ప్రసాదించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.
Read Also: RajaSaab movie : హైదరాబాద్ లులు మాల్లో రాజాసాబ్ టీమ్ సందడి…
ఈ సందర్భంగా సోనూసూద్ (Sonu Sood) మాట్లాడుతూ.. దేశంలో మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే తన లక్ష్యమని, ఈ విజయం తన బృందం, వైద్యుల సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ రహిత భారతదేశం కోసం మరిన్ని భారీ కార్యక్రమాలు చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్లో ప్రతిష్టాత్మక ‘హ్యూమానిటేరియన్ అవార్డు’ను కూడా అందుకున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్తో జతకట్టి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అవేర్నెస్ కోసం పనిచేస్తున్న సోనూసూద్ చేస్తున్న ఈ అద్భుతమైన సేవలను చూసి యావత్ దేశం ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: