हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Tirumala: అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

Saritha
Latest News: Tirumala: అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

నేటి నుండి సిఐడి, ఎసిబి దర్యాప్తు షురూ

తిరుమల : చిరు ఉద్యోగి… ఆపై పరకామణిలో లక్షల్లో చోరీ… ఆదాయానికి మించి (Tirumala) ఆస్తులు కలిగి ఉన్నాడనే అనుమానాలపై హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో నిందితుడు రవికుమార్ ఆస్తుల లెక్కలు తేల్చేపనిలో సిఐడి, ఎసిబి అధికారులు రంగంలోకి దిగుతున్నారు. వీళ్ళు సేకరించిన సమాచారాన్ని ఆదాయపు పన్నుశాఖ (ఐటి), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)కి అందజేయాలని వెలువడించిన ఆదేశాల వెనుక పెద్దకుట్ర ఉందనేది న్యాయస్థానం కూడా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. క్షుణ్ణంగా నిందితుడు ఆస్తులు ఎలా సంపాదించాడు, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎవరెవరికి విక్రయించాడు, ఇంకా ఏ మేరకు ఆస్తులు ఉన్నాయనే వివరాలు సేకరణలో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ బృందం, ఎసిబి చీఫ్ బృందం కార్యాచరణ రూపొందించుకుని సిద్దమైంది. ఇప్పటికే ఈ తతంగంలో నిందితుడికి సంబంధించి తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో భారీగా ఆస్తులు ఉన్నట్లు తగిన ఆధారాలు సేకరించి హైకోర్టు ధర్మాసనానికి సమర్పించింది. ఇంకా ఆ ఆస్తుల క్రయవిక్రయాల డాక్యుమెంట్లను, రికార్డులను సిఐడి రాబట్టిందనేది కీలక సమాచారం. ఇప్పుడు వీటన్నిటిపై నిశితంగా దర్యాప్తు చేసి తదువరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు ఐటి, ఇడిలకు సమాచారం ఇస్తే ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయనేది టిటిడిలో, రాజకీయవర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.

Read also: ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి

Tirumala
Tirumala Everyone’s attention is focused on Ravikumar’s assets!

పరకామణి చోరీ కేసులో లోతైన దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు

2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో(Tirumala) గుమస్తా సివి రవికుమార్ 920 అమెరికన్ డాలర్లు చోరీ చేయడం, తిరుమల పోలీసులు కేసు నమోదు చేయడం, తదుపరి విచారణ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోలేదని, లోక్ఆదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకోవడం వరకు అంతా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇంకా మరింత లోతుగా దర్యాప్తుకు హైకోర్టు ధర్మాసనం ఆదేశించడంతో సిఐడి, ఎసిబితో బాటు ఐటి, ఇడి శాఖల అధికారులు ఇక రంగంలోకి దిగుతున్నారు. 2023 జూన్లోనే అప్పటి టిటిడి బోర్డు పెద్దలు రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను 7 గిఫ్ట్ డీడ్లుగా శ్రీవేంకటేశ్వరస్వామికి స్వీకరించడం జరిగింది. వాటి విలువ మార్కెట్లో రూ.40 కోట్లు చేస్తుందని సిఐడి అంచనా. చోరీ సొత్తు విలువ లక్షల్లో ఉంటే శ్రీవారికి కానుకగా రూ.14 కోట్ల ఆస్తులు ఎందుకు స్వీకరించారనేది హైకోర్టు అనుమానాలు. ఈ వారంలో అనుమానాలు పటాపంచలు కానున్నాయనే చర్చమొదలైంది. ఈ కేసులో ఇప్పటికే గత వైసిపి ప్రభుత్వ హయాంలోని టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్లు వైవి సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్రెడ్డిని, మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డితోబాటు మాజీ సివిఎస్ నరసింహ కిశోర్, మాజీ విజిఒ గిరిధర్, ఏవిఎస్ పద్మనాభంను, అప్పటి తిరుమల సిఐలు జగన్మోహన్రెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను పరకామణి విధుల్లో ఉన్న టిటిడి అధికారులను వరుసగా 35మందిని పలు దఫాలుగా విచారణ చేసి వాంగ్మూలాలు రాబట్టిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న ఇన్ఫోసిస్ క్యాంపస్

విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న ఇన్ఫోసిస్ క్యాంపస్

ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు JAN 5 వరకు గడువు

ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు JAN 5 వరకు గడువు

విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే?

విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే?

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా: ఆర్బీఐ నివేదికే

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా: ఆర్బీఐ నివేదికే

దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ

దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ

కల్తీనెయ్యి కేసులో చిన్నఅప్పన్నకు గడ్డుకాలమే!

కల్తీనెయ్యి కేసులో చిన్నఅప్పన్నకు గడ్డుకాలమే!

తీర ప్రాంత అభివృద్ధికి మణిహారం వందేభారత్ రైలు

తీర ప్రాంత అభివృద్ధికి మణిహారం వందేభారత్ రైలు

మరో 2వేల మెగావాట్ అవర్ బేస్ ప్రాజెక్టులు

మరో 2వేల మెగావాట్ అవర్ బేస్ ప్రాజెక్టులు

డాట్ ల్యాండ్ సమస్యలు ఎన్నెన్నో… చుక్కల భూములపై దళారుల కన్ను

డాట్ ల్యాండ్ సమస్యలు ఎన్నెన్నో… చుక్కల భూములపై దళారుల కన్ను

ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు

ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

ఈరోజు నుంచి స్కూల్స్ లో ఆధార్ క్యాంపులు

ఈరోజు నుంచి స్కూల్స్ లో ఆధార్ క్యాంపులు

📢 For Advertisement Booking: 98481 12870