టెక్ మహీంద్రా, ఫిడే సంయుక్త భాగస్వామ్యంలో గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ ముంబైలోని రాయల్ ఒపెరా హౌస్లో నేటి నుంచి ప్రారంభమైంది. ఆరు జట్ల మధ్య 34 మ్యాచ్లు జరగనున్న ఈ లీగ్లో ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లు పోటీపడతారు. మహీంద్రా గ్రూప్ ఛైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, అర్జున్ ఎరిగైసి, ఆర్. ప్రజ్ఞానంద, హారికా ద్రోణవల్లి, అలీరెజా ఫిరౌజా ఈ వేడుకకు హాజరయ్యారు.
Read Also: IND vs PAK: ఈరోజుఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్

డిసెంబర్ 23న ఫైనల్
ఈ సీజన్ జీసీఎల్ లక్ష్యాలను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఎంపిక ద్వారా సాధిస్తున్నదని చైర్పర్సన్ పీయూష్ దూబే తెలిపారు. విశ్వనాథన్ ఆనంద్ తో పాటు అలీరెజా ఫిరౌజా, ఫాబియానో కరువానా, హికారు నకమురా, హౌ యిఫాన్ బరిలోకి దిగనున్నారు.10 రోజుల పాటు జరిగే ఈ లీగ్లో ప్రతి జట్టు 10 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడుతుంది, డిసెంబర్ 23న ఫైనల్ జరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: