हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Thailand Cambodia conflict : సీస్‌ఫైర్‌న్నా? థాయ్‌లాండ్ దాడులు ఆగబోవని స్పష్టం…

Sai Kiran
Thailand Cambodia conflict : సీస్‌ఫైర్‌న్నా? థాయ్‌లాండ్ దాడులు ఆగబోవని స్పష్టం…

Thailand Cambodia conflict : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ థాయ్‌లాండ్–కంబోడియా మధ్య కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించిన కొన్ని గంటల్లోనే, థాయ్ ప్రధాని అనుతిన్ చార్న్వీరకుల్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమ దేశ భద్రతకు ముప్పు పూర్తిగా తొలగే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

శనివారం ఉదయం అనుతిన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ, “మన భూమికి, మన ప్రజలకు హాని చేసే శక్తిని నిర్మూలించే వరకు చర్యలు ఆగవు. ఈ ఉదయం చేసిన చర్యలే దానికి ఉదాహరణ” అని అన్నారు.

ఇక కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపణల ప్రకారం, శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రకటించిన సీజ్‌ఫైర్‌ తర్వాత కూడా థాయ్ సైన్యం రెండు F-16 యుద్ధవిమానాలతో ఏడు బాంబులు కంబోడియా భూభాగంలో పడేసిందని తెలిపింది. (Thailand Cambodia conflict) ఉదయం 8 గంటల వరకు పలు గ్రామాలు, హోటళ్లు, రిసార్ట్ ప్రాంతాలపై వాయుసేన, నావికాదళ దాడులు జరిగినట్లు పేర్కొంది.

పుర్సాట్ ప్రావిన్స్‌లోని థ్మోర్ డా ప్రాంతంలో రెండు హోటళ్లు తీవ్రంగా దెబ్బతిన్న ఫోటోలను ఖ్మేర్ టైమ్స్ ప్రచురించింది. అంతేకాక థాయ్ నేవీ కోహ్ కాంగ్ ప్రాంతంలోని హోటళ్లు, బీచ్‌లపై 20 షెల్లులను విసిరినట్లు సమాచారం.

Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని

కంబోడియా ఇప్ప‌టివ‌ర‌కు మృతులు లేర‌ని చెబుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ఆరో రోజుకు చేరుకుంది. అక్టోబర్‌లో ట్రంప్ మద్యవర్తిత్వంతో జరిగిన శాంతి ఒప్పందం సోమవారం నుంచి పూర్తిగా బీటలు వారింది.

ఇప్పటి వరకు రెండు దేశాల్లో కనీసం 20 మంది మరణించగా, 200 మంది పైగా గాయపడ్డారు. 600,000 మంది సరిహద్దు ప్రాంతాల్లో నివాసాలు వదిలి వెళ్లాల్సి వచ్చింది. పూర్వకాల దేవాలయాల యాజమాన్యంపై వివాదమే ఈ యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది.

ట్రంప్ అయితే శుక్రవారం Truth Socialలో “కాల్పులన్నీ ఆగేందుకు ఇద్దరు ప్రధాన మంత్రులు అంగీకరించారు” అని ప్రకటించారు. కానీ థాయ్ ప్రధాని ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ, “రోడ్డు బాంబు పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందే కాదు” అని స్పష్టం చేశారు.

బ్యాంకాక్‌లోని అల్ జజీరా ప్రతినిధి తెలిపిన ప్రకారం, రాబోయే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుతిన్ ప్రజాదరణ ఈ సంఘటనలతో పెరిగింది. ఈ రాజకీయ లాభం దృష్ట్యా, ఎన్నికలు జరిగే వరకు ఆయన సీజ్‌ఫైర్‌కు తిరిగి వెళ్లే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషణ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870