हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

News Telugu: AP: రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ యధాతథం: చంద్రబాబు హామీ

Rajitha
News Telugu: AP: రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ యధాతథం: చంద్రబాబు హామీ

విజయవాడ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవిన్యూ డివిజన్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం (డీఎస్పీఆఫీస్ ) ఎట్టి పరిస్థితిలో యధాతధంగా రామచంద్రపురం కేంద్రంగా కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CHANDRABABU) రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు హామీ ఇచ్చారు. బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి సుభాష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు స్పందిస్తూ రామచంద్రపురం రెవిన్యూ డివిజన్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయాలు అక్కడే కొనసాగుతాయని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని భరోసా ఇచ్చారు.

Read also: Ambati vs Pawan: పవన్ కళ్యాణ్‌కు నీతి లేదు, సిద్ధాంతం లేదు: మాజీ మంత్రి ధ్వజం

Ramachandrapuram revenue division

Ramachandrapuram revenue division to remain unchanged

అందరికీ అధికార యంత్రాంగం ద్వారా

అలాగే రామచంద్రపురం నియోజక వర్గం అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయిస్తానని సిఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీ ఇవ్వడంతో మంత్రి వాసంశెట్టి సుభాష్ సిఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని, యధావిధిగా అక్కడే పరిపాలన కొనసాగుతుందని మంత్రి సుభాష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం రైతాంగం సమస్యలపై మాట్లాడుతూ రైతుల అభీష్టం మేరకు ధాన్యం సేకరణ, కొనుగోలు 50 కిలోమీటర్ల వరకూ అవకాశం కల్పించామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైస్ మిల్లర్లు అందరికీ అధికార యంత్రాంగం ద్వారా తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ప్రజలకు విజప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870