గత వారం దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దులు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. వందల సంఖ్యలో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల కొద్దీ విమానాశ్రయాల్లో ఇరుక్కుపోయారు. నిన్నటి నుంచి కొన్ని సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటికీ, సంక్షోభం కారణంగా జరిగిన ఇబ్బందులు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇండిగో ఫ్లైట్లు పెద్ద ఎత్తున రద్దు కావడంతో ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. (Indigo) సాధారణంగా రూ.15 వేలకే లభించే ముంబై–ఢిల్లీ ఫ్లైట్ టికెట్ ఈ పరిస్థితుల్లో ₹39–40 వేల వరకు చేరింది. రెండు, మూడు రెట్లు పెరిగిన ధరలు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.
Read also: భారత్ రైస్ ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రగామి

ఇండిగో రద్దులపై హైకోర్టు ప్రశ్నలు
దానిపై(Indigo) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ఈరోజు విచారణ చేపట్టింది. సంక్షోభం ఎందుకు వచ్చిందో, ముందే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదో కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంక్షోభ సమయంలో ఇతర కంపెనీలు టికెట్ ధరలు ఇష్టానుసారం పెరగడానికి కోర్టు వివరణ కోరింది. ప్రయాణికులు ఇబ్బందుల్లో కూరుకుపోయినా, సరైన సహాయక చర్యలు ఎందుకు లేవు? ఫ్లైట్ టికెట్లు ఏకంగా ₹40 వేల వరకు ఎలా పెరిగాయి? అనే ప్రశ్నలను వరుసగా కేంద్రానికి సంధించింది. కేంద్రం తీసుకున్న చర్యలను అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించినప్పటికీ, న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. ఈ సంక్షోభంపై పూర్తి సమాచారం అందించాలని డీజీసీఏ ఇండిగో సంస్థను ఆదేశించింది. రద్దైన ఫ్లైట్ల వివరాలు, రీఫండ్లపై సమాచారం, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది లభ్యత, భవిష్యత్తులో సేవల పునరుద్ధరణ ప్రణాళిక వంటి డేటాను సమగ్రంగా సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ,సంబంధిత అధికారులను రేపు మధ్యాహ్నం డీజీసీఏ కార్యాలయానికి పిలిపించారు. ఇండిగో విమానాల అంతరాయంపై స్పష్టమైన నివేదికను పొందిన తరువాత మాత్రమే తదుపరి చర్యలు నిర్ణయిస్తామని డీజీసీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ విమాన సంక్షోభం ప్రయాణికులకు మాత్రమే కాకుండా విమానయాన రంగానికి కూడా గట్టి హెచ్చరికగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: