కిడ్నీ వ్యాధులు(Kidney Health) ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. చాలామందికి కిడ్నీ దెబ్బతింటున్నప్పుడు అలసట, వాపు, మూత్రంలో మార్పులు వంటి లక్షణాలే గుర్తొస్తాయి. కానీ కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలోనే మన కళ్లలో కూడా స్పష్టంగా ప్రభావం చూపుతాయి అనేది చాలా మందికి తెలియదు.

కిడ్నీలు, కళ్లు రెండూ శరీరంలోని సున్నితమైన రక్తనాళ వ్యవస్థపై ఆధారపడి పని చేస్తాయి. ఒక అవయవంలో సమస్య మొదలైతే మరొకదానిపై ప్రభావం పడటం సహజం. ముఖ్యంగా Chronic Kidney Disease (CKD) ప్రారంభ దశల్లో ఎలాంటి సమస్యలు కనిపించకపోయినా, కళ్లలో సూక్ష్మ మార్పులు మాత్రం ముందుగానే కనిపించవచ్చు. ఈ లక్షణాలను తెలుసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలను చాలా ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు.
కిడ్నీ సమస్యలను సూచించే కంటి లక్షణాలు
కళ్ల చుట్టూ వాపు (Eye Puffiness)
రోజూ ఉదయం కళ్లు ఉబ్బినట్లు(Kidney Health) అనిపిస్తే… అది ప్రోటీన్యూరియా (మూత్రంలో ప్రోటీన్ లీక్ అవడం) కి సంకేతం కావచ్చు. కిడ్నీలు బలహీనపడితే రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. దీంతో ద్రవం కళ్ల చుట్టూ చేరి వాపు వస్తుంది. అదే సమయంలో నురుగుతో కూడిన మూత్రం కూడా కనిపిస్తే, కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిన్న సూచన కావచ్చు.
మసక దృష్టి / రెండురెండుగా కనిపించడం
ఆచానకంగా కనిపించే దృష్టి సమస్యలు కేవలం కంటి సమస్యలు మాత్రమే కాకపోవచ్చు. అధిక రక్తపోటు మరియు మధుమేహం కిడ్నీలను మరియు రెటీనాలోని నరాలను రెండింటినీ దెబ్బతీస్తాయి. రెటీనా రక్తనాళాలు ఉబ్బి ద్రవాన్ని లీక్ చేస్తే దృష్టి మసకబారుతుంది.
కొన్ని సందర్భాల్లో ఇది తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దృష్టి కోల్పోవడానికి కూడా దారితీస్తుంది.
కళ్లు పొడిబారడం, మంట, ఇసుక రేణువు ఉన్నట్లుగా అనిపించడం
శరీరంలో మలినాలు పేరుకుపోయినా, ఖనిజాల సమతుల్యత తప్పినా… యురేమియా ఏర్పడి కంటిపాపల్లో వాపు, కన్నీటి ఉత్పత్తి తగ్గడం జరుగుతుంది. డయాలసిస్లో ఉన్నవారికి ఈ లక్షణాలు మరింతగా కనిపిస్తాయి.
కళ్లు ఎర్రగా కనిపించడం
ఎరుపుదనం కేవలం అలసట వల్ల మాత్రమే కాదు. కిడ్నీ రోగుల్లో అధిక రక్తపోటు వల్ల కంటిలోని సున్నితమైన రక్తనాళాలు చిట్లి కళ్లు ఎర్రబడుతాయి. లూపస్ నెఫ్రైటిస్ వంటి కొన్ని వ్యాధుల్లో కంటిలో వాపు, దద్దుర్లు కూడా కనిపించవచ్చు.
కిడ్నీలు – కళ్లు : ఒకే వ్యవస్థకు చెందిన రెండు భాగాలు
రెండు అవయవాలూ సున్నితమైన రక్తనాళాలపై ఆధారపడి పనిచేస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం మొదట ఈ చిన్న రక్తనాళాలనే దెబ్బతీస్తాయి. అందుకే కిడ్నీల్లో సమస్య మొదలైతే కళ్లలో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి?
ఈ లక్షణాలు తరచూ కనిపిస్తే వెంటనే కిడ్నీ పరీక్షలు చేయించుకోండి:
- నిరంతరం కళ్ల వాపు
- మసక దృష్టి
- ఎరుపుదనం
- పొడిబారడం
- అలసట, వాంతులు
- మూత్రంలో మార్పులు
మధుమేహం, అధిక రక్తపోటు, కుటుంబంలో కిడ్నీ సమస్యలున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
నిర్లక్ష్యం ప్రమాదం!
కిడ్నీ వ్యాధులు మౌనంగా పెరుగుతాయి.
అందుకే కళ్లలో వచ్చే చిన్న మార్పులైనా శరీరం ఇస్తున్న హెచ్చరికలే.
సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీ ఆరోగ్యం కూడా, చూపు కూడా రక్షించుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: