సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా (Team India) పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్రేట్ కారణంగా భారత క్రికెట్ జట్టు (Team India) కు జరిమానా పడింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Suruchi Singh: షూటింగ్ వరల్డ్కప్ లో సురుచి విజయం

మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు
ఐసీసీ రూల్స్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే.. ఓవర్కు 5 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. ఈ లెక్కన భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది.
ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, రోహన్ పండిట్, థర్డ్ అంపైర్ సామ్, ఫోర్త్ అంపైర్ జయరామన్ ఫిర్యాదు మేరకు మ్యాచ్ రిఫరీ, చర్యలు తీసుకున్నారు.ఈ సిరీస్ లో, టీమిండియా 2-1తో గెలిచింది. రెండో వన్డేలో ఓడినా.. ఆఖరి మ్యాచ్ గెలిచి భారత్ సిరీస్ను సొంతం చేసుకుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: