తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు( Sarpanch Elections) ఎన్నో విచిత్ర పరిణామాలకు వేదికగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పంచాయతీలో ఒక వినూత్న ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ పదవిని గెలుచుకోవాలంటే తనతో పాటు తన భార్య కూడా పోటీలో ఉండాలని జ్యోతిష్య సలహా రావడంతో స్థానిక అభ్యర్థి నారగోని మహేష్, తన సతీమణి నారగోని శ్రీలతకూ నామినేషన్ దాఖలు(Filing of nomination) చేయించారు. శనివారం విడుదలైన నమూనా బ్యాలెట్ పేపర్పై భార్యాభర్తలిద్దరి పేర్లు కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సెంటిమెంట్ మహేష్కు విజయాన్ని అందిస్తుందా లేదా అనేది ఫలితాలు వెలువడే వరకు మిస్టరీగానే ఉంది.
Read Also: Strong Room Check: పోలింగ్ మెటీరియల్ భద్రతపై పర్యవేక్షణ

ఇక జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంనగర్ పంచాయతీలో(Sarpanch Elections) రాజకీయ పోటీ కుటుంబంలోనే హోరాహోరీగా మారింది. 253 మంది ఓటర్లున్న ఈ చిన్న పంచాయతీలో మాజీ సర్పంచ్ తాళ్లపెల్లి సత్యనారాయణ, అతని కోడలు రాధిక నేరుగా సర్పంచ్ పదవికి బరిలో ఉన్నారు. మొదట సత్యనారాయణ కుమారుడు శ్రీరామ్ కూడా పోటీకి దిగినా, నామినేషన్ ఉపసంహరణ సమయంలో ఆయన తప్పుకోవడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. వీరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు కూడా మెదానంలో ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన మామా–కోడళ్ల మధ్య నేరుగా పోటీ నెలకొనడంతో ఈ ఎన్నికలు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: