
భారత్, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో మూడవ మ్యాచ్ నేడు (శనివారం) విశాఖపట్నంలోని డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుసగా 20 వన్డేల టాస్ గెలవడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ రాహుల్కు మద్దతు తెలిపారు.
Read Also: Kohli: ఈరోజే IND-SA మూడో వన్డే.. అందరి దృష్టి కోహ్లీపైనే
ఈ మ్యాచ్కు ప్రేక్షకుల మద్దతు బాగా ఉంది
టీమిండియా చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది.టాస్ గెలిచిన అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. “నిన్న రాత్రి ఇక్కడ ప్రాక్టీస్ చేశాం. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నాం. జట్టుగా మేం నిలకడగా రాణిస్తున్నాం. అదే పద్ధతిని కొనసాగించాలనుకుంటున్నాం.
ఈ మ్యాచ్ కోసం జట్టులో ఒకే మార్పు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ తుది జట్టులోకి వచ్చాడు” అని తెలిపాడు. మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. ‘మేం కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లం. మాకు మెరుగైన ఆరంభం లభిస్తే మిడిలార్డర్ బ్యాటర్లకు ఉపయోగపడనుంది. గత రెండు మ్యాచ్లు చాలా సరదాగా సాగాయి. ఈ మ్యాచ్కు ప్రేక్షకుల మద్దతు బాగా ఉంది.
ఈ (IND vs SA) మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగుతుందని ఆశిస్తున్నా. జట్టులో రెండు మార్పులు చేశాం. ర్యాన్ రికెల్టన్, బార్ట్మన్ జట్టులోకి వచ్చారు. బర్గెర్, డీ జోర్జి రెండు వారాలు ఆటకు దూరమయ్యారు.’అని బవుమా చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మన్.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: