అంతరించిపోతున్న అరుదైన పక్షులను దొంగచాటుగా రవాణా చేసి సొమ్ము చేసుకోవడం కొందరు స్మగ్లర్ల(smuggling)కు పరిపాటిగా మారింది. అలాంటి చర్యను కేరళ(Kerala)లో మరోసారి కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఎర్నాకులంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్ల్యాండ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న 11 విలువైన వన్య పక్షులను స్వాధీనం చేసుకుంటూ ఓ జంటను అధికారులు అరెస్ట్ చేశారు.
Read Also: TR Balu : బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు
థాయ్ల్యాండ్ నుంచి కౌలాలంపూర్ మార్గంగా కొచ్చికి చేరుకున్న ఆ జంటను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా, వారి లగేజీపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. బ్యాగులు తెరిచి చూసిన అధికారులు షాకయ్యారు ప్రత్యేకంగా రూపొందించిన గుప్త ఖానాలలో అరుదైన పక్షులను దాచిపెట్టి రవాణా చేస్తున్నట్లు బయటపడింది. ఆ దంపతులతో పాటు వారి ఏడేళ్ల కుమారుడు కూడా ప్రయాణిస్తున్నాడు.

CITES నిబంధనల ప్రకారం
అంతర్జాతీయ వన్యప్రాణి రక్షణ ఒప్పందమైన CITES నిబంధనల ప్రకారం, స్వాధీనం చేసుకున్న పక్షులను అటవీ శాఖకు అప్పగించారు. మలయత్తూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్తీక్ తెలిపారు, ఈ కేసు మీద దర్యాప్తు ప్రారంభమైందని, ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
CITES నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి అంతరించిపోతున్న జాతుల అక్రమ రవాణా తీవ్రమైన నేరం. స్వాధీనం చేసిన జంతువులు లేదా పక్షులను అవి చెందిన దేశానికే తిరిగి పంపాలని ఆ ఒప్పందం పేర్కొంటుంది. అందుకే పక్షులకు అవసరమైన వైద్య చికిత్స చేసి తిరిగి థాయ్ల్యాండ్కు పంపే ప్రక్రియను అటవీ శాఖ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: