ఏపీ రాజకీయాల్లో విమాన ప్రయాణాల ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ (jagan) రెడ్డి తన ఐదేళ్ల పదవీకాలంలో విమానాలపై రాష్ట్ర ఖజానా నుంచి 222 కోట్లు ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మరియు లోకేష్ మధ్య ప్రజల సొమ్ము వినియోగంపై చర్చ మొదలైంది.
Read also: Ashwini Vaishnav: కొత్త రైల్వే స్టేషన్లతో పాటుగా కొత్త రైళ్ల మంజూరు

Jagan & Lokesh? Who organized jalsa
లోకేష్ తన 77 ట్రిప్ల ఖర్చును తన సొంత జేబు నుండి భరించారని
వైసీపీకి టీడీపీ రివర్స్ కౌంటర్ ఇవ్వగా, లోకేష్పై కూడా విమాన ప్రయాణాల కోసం ప్రజాధనాన్ని వాడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినాయి. వైసీపీ ముఖ్యంగా లోకేష్ వీకెండ్లలో తరచుగా హైదరాబాద్కు వెళ్ళడం, చార్టర్డ్ విమానాలను వాడి ఖర్చు చేయడం కారణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో కొడమల సురేష్ ఆర్టిఐ ద్వారా లోకేష్ ఖర్చుల వివరాలను తెలుసుకోవడానికి దరఖాస్తు చేసాడు. ఆర్టిఐ ద్వారా లభించిన సమాచార ప్రకారం, లోకేష్ పర్యటనలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఖర్చు ఉపయోగించలేదని స్పష్టం అయింది. ముఖ్యంగా రియల్ టైం గవర్నెన్స్, ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్న లోకేష్ తన 77 ట్రిప్ల ఖర్చును తన సొంత జేబు నుండి భరించారని అధికారులు పేర్కొన్నారు.
వీటితో పాటు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమాన, హెలికాప్టర్ ప్రయాణాల కోసం 2019–24 మధ్య రాష్ట్ర ఖజానా నుంచి 222.85 కోట్లు ఖర్చు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గణాంకాలు వెల్లడించాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: