ఇండోనేసియా, శ్రీలంక, థాయ్ లాండ్ లో గతవారం వరదలు సంభవించి భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని తీసుకొచ్చింది. కొండచరియలు విరిగిపడడం, రోడ్లు దెబ్బతినడంతో రవాణవ్యవస్థకు, విద్యుత్ సౌకర్యం దెబ్బతినడంతో ఇంటర్నెట్ సేవలకు ఆటంకం ఏర్పడింది. వరదలకు అనేకులు గల్లంతు అయ్యారు.
Read Also: Breaking news: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులతో ఎన్కౌంటర్ – ఐదుగురి మృతి

అంతేకాక కొండచరియలు (Ditwa Floods) విరిగిపడి మరికొందరు మరణించారు. పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల వంతెనలు తెగిపోయాయి, భారీ చెట్టు కూలిపోయాయి. తాజాగా మూడుదేశాల్లో మరణించిన వారి సంఖ్యను అధికారులు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1230కు చేరుకుంది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ప్రకృతి బీభత్సంతో ఇండోనేసియాలో 659 మంది, శ్రీలంకలో 390 మంది, థాయ్ లాండ్ లో 181 మంది మరణించారని మంగళవారం అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టడానికి రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. మృతదేహాలను వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. ఇండోనేసియాలో (Indonesia) రోడ్లు కొట్టుకుపోయి వంతెనలు కూలిపోయాయి. సుమిత్రా ద్వీపంలోని గ్రామాలకు చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇండోనేసియా నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ప్రకారం 475 మంది తప్పిపోయారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: