నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ (Ukraine) లమధ్య యుద్ధం వల్ల వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. నిత్యం వార్తల్లో నిలుస్తున్న పుతిన్ తాజాగా మరో అంశంతో మీడియాకెక్కారు. ఈసారి పుతిన్ ఐరోపా దేశాలకు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. యూరప్ కనుక యుద్ధాన్ని ప్రారంభించాలని కోరుకుంటే మేం దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడానికి.. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ మాస్కోలో పుతిన్ తో చర్చలు జరిపిన కీలక సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి.
Read Also: Donald Trump: క్యాబినెట్ మీటింగ్లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్

యుద్ధం చేసే ఉద్దేశం లేదు: పుతిన్
రష్యాకు యూరప్ తో యుద్ధం చేసే ఉద్దేశం లేదని పుతిన్ (Putin) పునరుద్ఘాటించారు. అయితే తన హెచ్చరిక యుద్ధాన్ని నిరోధించడం కోసం మాత్రమే చేసినట్లు వివరించారు. ఉక్రెయిన్ తో వివాదంపై ఒక అంగీకరాం కుదరకుండా యూరోపియన్ నేతలు అడ్డుకుంటున్నారని అదే సమయంలో నిందను మాస్కోపై మోపాలని చూస్తున్నారని పుతిన్ ఆరోపించారు. రష్యా డ్రోన్ చొరబాట్లు, గగనతల ఉల్లంఘనలు, విధ్వంసక చర్యల నేపథ్యంలో మాస్కో చొరబాట్లు, గగనతల ఉల్లంఘనలు, విధ్వంసక చర్యల నేపథ్యంలో మాస్కో లక్ష్యాలు ఉక్రెయిన్ దాటి ఉన్నాయని యూరోపియన్ ప్రభుత్వాలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తొలి శాంతి ముసాయిదా తయారీలో యూరప్ దేశాలను వాషింగ్టన్ పక్కన పెట్టడం పట్ల వారు అసంతృప్తితో ఉన్నారు. ఏదేమైనా యూరోపియన్ భాగస్వాములు అన్ని నిర్ణయాలలో పాలుపంచుకునేలా కృషి చేస్తున్నామని ఉక్రెయిన్ దౌత్యవేత్తలు తెలిపారు. మొత్తంగా ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ పుతిన్ హెచ్చరికలతో యూరప్ రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: