ఈ నెల 4న రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ లో రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సందర్శించనున్నారు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై రెండు దేశాల అగ్రనేతలు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే రష్యా ఆర్థిక వ్యవస్థ విషయంలో చూసుకుంటే అక్కడ భవన నిర్మాణం, జౌళి, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఉంది.
రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణం
ఈ నేపథ్యంలోనే 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులకు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించారు..
ఇలాంటి తరుణంలో పుతిన్కు భారత్కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) పర్యటనకు ముందే ఆ దేశం కీలక ఒప్పందానికి ఆమోదం తెలిపింది. రెసిప్రొకల్ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS)ను రష్యా ఆమోదించింది. ఇందులో రష్యా సైనిక నిర్మాణాలు, యుద్ధనౌకలు, సైనిక విమానాలను భారతదేశానికి పంపే విధాన్ని నిర్దేశిస్తుంది.
ఒకరికొకరు సహకారం
ఇరు దేశాల మధ్యనాలాజిస్టికల్ మద్దతును ఈ ఒప్పందం కల్పించనుంది. వీటితో పాటూ సైన్యం తాలూకా శిక్షణ, మానవతా సహాయం, ప్రకృతి, మానవ నిర్మిత విపత్తు సహాయ ప్రయత్నాలలో రష్యా, భారత్.. భవిష్యత్తులో ఒకరికొకరు సహకారం అందించుకోనున్నారు. భారత్ తో మా సంబంధాలు వ్యూహాత్మకమైనవి, సమగ్రమైనవి. మేము వాటిని విలువైనవిగా భావిస్తాము.
ఈరోజు చేసుకున్న ఒప్పందంతో ఇరు దేశాలు పరస్పరం మా సంబంధాల అభివృద్ధి వైపు మరొక అడుగు వేస్తామని తాము అర్ధం చేసుకున్నామని రష్యా స్టేట్ డూమా స్పీకర్ వ్యాచెస్లావ్వోలోడిన్ (Duma Speaker Vyacheslav Volodin) చెప్పారు.

ఫైటర్ జెట్లను కొనేందుకు భారత్ ఆసక్తి
రష్యా (Russia) డిఫెన్స్ టెక్నాలజీని పొందడం భారత్కు వ్యూహాత్మక అవసరం. రష్యా నుంచి ఆయుధాలు కొనడమే కాకుండా.. వాటిని స్వదేశంలోనే తయారుచేసుకోవడం, అలాంటి టెక్నాలజీని రష్యా నుంచి పొందడం భారత్కి కీలకం కాబోతోంది. రష్యా నుంచి మరిన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్లు, సుఖోయ్-57 ఫైటర్ జెట్లను కొనేందుకు భారత్ ఆసక్తిగా ఉంది.
వీటన్నిటిపైనా పుతిన్-మోదీ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలతో ఇంధన రంగంలో సహకారంపై కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరగొచ్చు.
ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడమే ఇరు దేశాల లక్ష్యం
ఇరు దేశాల మధ్యన సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని. రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఆయిల్, పరిశ్రమలు, స్పేస్, వ్యవసాయం, టెక్నాలజీ వంటి రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడమే ఇరు దేశాల లక్ష్యమని చెప్పారు.
భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశం పైన ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పుతిన్ తెలిపారు. భారత్ కు రష్యా కీలక ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుందని అన్నారు. ఇదిలాఉండగా 2021 తర్వాత పుతిన్ భారత్కు రావడం ఇదే మొదటిసారి.
రష్యా-భారత్ సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి?
రష్యా ,భారత్ మధ్య సంబంధాలు 1947లో భారత స్వాతంత్య్రం, తర్వాత దౌత్య సంబంధాలు, ప్రారంభమయ్యాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: